హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో(Rangareddy district) గంజాయి చాక్లెట్లను(Cannabis Chocolates) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్ మండలం తోల్కట్టలో 92 గంజాయి చాక్లెట్లతో పాటు 580 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.