సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ అన్ని జోన్లలో సరిళ్ల వారీగా పారిశుధ్య కార్మికులకు క్యాన్సర్ డిటెక్షన్ (గుర్తింపు)ను సీఎస్ఆర్ కింద కారినోస్ కార్పొరేట్ బాడీ భాగస్వామ్యంతో నిర్వహిస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నం.12 సీఎంటీఈఎస్ ఆఫీస్లో పారిశుధ్య కార్మికులకు కారినోస్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రతి సరిల్లో ఆరు రోజుల పాటు క్యాన్సర్ స్రీనింగ్ టెస్టులను మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహిస్తారని మేయర్ తెలిపారు. పారిశుధ్య కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ తెలిపారు. క్యాన్సర్ వైద్యం ఖరీదైనదని, ప్రైవేట్ దవాఖానలలో చేరి డబ్బులు వృథా చేసుకోకూడదని మేయర్ సూచించారు. బస్తీ దవాఖానాలలో 40 రకాల టెస్టులను ఉచితంగా చేస్తున్నారని చెప్పారు.
జీహెచ్ఎంసీ కార్మికులు క్యాన్సర్ నిర్ధారణ అయినచో వారి బంధువుల ద్వారా సమాచారాన్ని మేయర్ క్యాంపు కార్యాలయానికి, జోనల్, డిప్యూటీ కమిషనర్కు తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. కారినోస్తో ఆరు రకాల క్యాన్సర్ కారక వ్యాధులను గుర్తిస్తారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధికి అన్ని రకాల మందులు వచ్చాయని, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని తెలిపారు. జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల సంరక్షణ కోసం ప్రతి సంవత్సరం కిట్లను అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒకరూ తమకు కేటాయించిన డ్రెస్లను క్రమం తప్పకుండా ధరించేలా చూడాలని ఎస్ఎఫ్ఏలను ఆదేశించారు. పారిశుధ్య కార్మికులు ఉదయం 5:45 గంటలకు రోడ్ల ఊడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని, బయోమెట్రిక్ పాటించాలని తెలిపారు. కారినోస్ ద్వారా చేపడుతున్న క్యాన్సర్ స్రీనింగ్ను సీఎంవోహెచ్, ఏఎంవోహెచ్లు సమన్వయం చేసుకోవాలన్నారు. కారినోస్ ద్వారా గుర్తించిన ఆరోగ్య సమాచారాన్ని నెల రోజుల్లో సమర్పించాలని కోరారు. కారినోస్కు కావాల్సిన రిసోర్స్ పర్సన్ను జీహెచ్ఎంసీ అందిస్తుందని తెలిపారు.
ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
క్యాన్సర్ నివారణకు విలక్షణమైన, అందుబాటు ధరలో క్యాన్సర్ సంరక్షణను అందించే విశ్వనాథ్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్తో భాగస్వామ్య మిషన్లో కలిసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో భాగస్వామ్యం అవుతున్నామని కారినోస్ సలహాదారు డాక్టర్ శ్రీరాం సిప్లా చెప్పారు. కారినోస్ ద్వారా రిస్ అసెస్మెంట్ డిజిటల్ ఫ్లాట్ ఫాం, మేనేజ్డ్ కేర్ సస్పెక్టడ్ విక్టిమ్స్ ఎర్లీ డిటెక్షన్ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్, సీఎంవోహెచ్ పద్మజ, అంకాలజిస్ట్ డా.స్రవంతి, డా.కామాక్షి, డా.సనా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.