మన్సూరాబాద్, నవంబర్ 27: క్యాన్సర్, మధుమేహం, మానసిక రోగాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ తార్నాక, 320 బీ ఆధ్వర్యంలో అద్వన్ పేరుతో ఆటోనగర్లోని అనన్య ఏకో పార్కు నుంచి కారు, బైకు ర్యాలీ నిర్వహించారు. ఆటోనగర్ నుంచి నార్కట్పల్లి మీదుగా సూర్యాపేట చేరుకుని అక్కడి నుంచి విజయవాడ వరకు హెల్త్ అవేర్నెస్ ర్యాలీ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
320 బీ అధ్యక్షుడు శశిప్రీతం ఆధ్వర్యంలో కొనసాగిన ర్యాలీలో వనస్థలిపురం సీఐ సత్యనారాయణ, బిగ్బాస్ ఫేం శ్వేతవర్మ, మోడల్ అజిత్శుక్లా, లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు కమల్ కిశోర్, తీగల మోహన్రావు, డాక్టర్ వసుధ, డాక్టర్ మల్లిక్ సింగరాజు, డాక్టర్ ఐశ్వర్య కృష్ణప్రియ, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.