ఉప్పల్, అక్టోబర్ 22 : ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నంబర్వన్గా తీర్చిదిద్దుతామని బీఆర్ఎస్ ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని ఉప్పల్, హబ్సిగూడ, ఏఎస్రావునగర్, తదితర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. హబ్సిగూడ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన హబ్సిగూడ డివిజన్ కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షుడు జైనవీన్ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో యువకులు గులాబీ కండువా కప్పుకున్నారు.
చిలుకానగర్ డివిజన్లో చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బండారి లక్ష్మారెడ్డి మాట్లాడారు. మూడోసారి సీఎంగా కేసీఆర్ రాబోతున్నారని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.