కంటోన్మెంట్/బొల్లారం, నవంబర్ 19: కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గులాబీ పార్టీ వైపే జనమంతా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత తెలిపారు. ఎన్ని పార్టీలున్నా ప్రజలంతా గులాబీజెండాకు జై కొడుతున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం రెండవ వార్డు పరిధిలోని రసూల్ పురా, ఇందిరమ్మ నగర్, శ్రీలంక బస్తీల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత పాల్గొని ఓట్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా లాస్యనందిత మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే బీఆర్ఎస్కే ఓటేయాలని కోరారు. ఇతర పార్టీల నేతలు ఎన్ని కుట్రలు చేసినా జనమంతా తమ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం.. దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన మంచి పనులే తనను గెలిపిస్తాయన్నారు. ఈ పాదయాత్రలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, సీనియర్ నాయకులు దేవేందర్, టీఎన్ శ్రీనివాస్, ముజాయిద్ ఖాన్, నరేశ్, ముక్రం, కుమార్, ఆంజనేయులు, రఫీక్, రవూఫ్, శ్రీనివాస్, మోయిస్, ఇలియాస్, కలీం, నుమాన్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందితకు మద్దతుగా ఒకటో వార్డులోని కృష్ణారెడ్డి నగర్ కాలనీ, సంజీవయ్యనగర్ కాలనీ, రిలయన్స్ విల్లాస్, అయ్యప్ప సొసైటీ, హనుమాన్జీ సొసైటీ, గ్రీన్ఫీల్డ్ కాలనీ, చిన్నతోకట్ట ప్రాంతంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి భారీ ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అదే విధంగా మూడో వార్డులోని ఓల్డ్ మడ్ఫోర్డ్, బజార్ గల్లీ, ధోబీఘాట్, గాంధీనగర్, శ్రీరామ్నగర్, అంబేద్కర్నగర్, కట్టకింది బస్తీల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో బోర్డు మాజీ సభ్యురాలు అనితాప్రభాకర్తో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి సోదరి, సీనియర్ నాయకురాలు నివేదిత పాల్గొన్నారు. ఆయా ప్రచారాల్లో బాబూరావు, మోహినుద్దీన్, బబుల్రావు, రాజు, శ్రావణ్, విజయ్, సాయికుమార్, అనిల్, శివ, సునీల్, టింకూ, హాసీన్ఖాన్, నర్సింహరావు, ప్రభుగుప్తాతో పాటు సచ్చు, మధు పటేల్, ఆశిష్ కుమార్, లడ్డూ, దిలీప్, శ్రీకాంత్, పరశురామ్, చిన్న, సూరి, అశోక్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందితకు మద్దతుగా బొల్లారం ఆదర్శనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దివంగత నేత సాయన్న ఆదర్శనగర్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని,ఈ ఎన్నికల్లో సాయన్న కుమార్తె లాస్య నందిత కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈఆర్ బాల్రాజు,మిలట్రీ రమేష్,ఎర్రోళ్ల గిరి,వెంకట్,రామయ్య తదితరులు పాల్గొన్నారు.