జవహర్నగర్, ఏప్రిల్ 12: జవహర్నగర్ కార్పొరేషన్లోని ఖాళీగా ఉన్న 16వ డివిజన్కు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ జ్యోతిరెడ్డి తెలిపారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ జ్యోతిరెడ్డి అధ్యక్షతన రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితాపై 19లోగా అభ్యంతరాలను స్వీకరించి 21న తుది జాబితాను ప్రదర్శించి జిల్లా వెబ్సైట్లతో పొందు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నాఉ. అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఈ చెన్నకేశవులు, మేనేజర్ నగేశ్, టీపీఎస్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు శ్రీకాంత్యాదవ్, శంకర్, యాకస్వామి పాల్గొన్నారు.