సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర వాసులు ఇండ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు, ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా టీవీలకే అతుక్కుపోయారు. ఆదివారం వరుణుడు శాంతించడంతో అంతా పార్కుల బాట పట్టారు.
వృద్ధులు పార్కుల్లోని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ.. సేద తీరగా.. చిన్నారులు వివిధ రంగాల్లోని శిక్షణ తరగతులను కంటిన్యూ చేశారు. దీంతో నగరంలోని పలు జీహెచ్ఎంసీ పార్కులు కళకళలాడాయి. సనత్నగర్ నియోజకవర్గంలోని నెహ్రూ పార్కు, మహాత్మాగాంధీనగర్ పార్కుల్లో ఈ దృశ్యాలు కనిపించాయి.