సిటీబ్యూరో, జూన్ 18 ( నమస్తే తెలంగాణ ) : గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం పర్ఫెక్ట్ 360 ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలను సన్మానించి బహుమతులు అందించారు.
వివిధ రంగాల్లో రాణించిన 35 మందిని సత్కరించారు. ఓటియా కేఫ్, డాక్టర్ శివానందరెడ్డి, ఎంఎన్ఆర్ టెక్నాలజీ, ఎస్ఎస్కే, ఎల్బీ రాజు, ఆడ్ల దిలీప్రెడ్డి, ఎస్వీ గ్లోబల్ సర్వీసెస్, అనన్యరావు, గిఫ్టింగ్ వరల్డ్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులకు పర్ఫెక్ట్ ఎమినెంట్ అవార్డులను అందించారు. కార్యక్రమంలో ఏపీ ఎమ్మెల్సీ రమేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.