మియాపూర్: పేదలపై మరోసారి బుల్డోజర్తో విరుచుకుపడ్డారు. వీధి వ్యాపారాలతో జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాలను రోడ్డునపడేశారు. మియాపూర్ మెట్రో సమీపంలోని సోఫా దుకాణాలను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీసు పహారా మధ్య యంత్రాల సాయంతో నేలమట్టం చేశారు. ఏండ్ల తరబడి సోఫా విక్రయాలతో కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఈ అంశంపై కోర్టులో కేసు కొనసాగుతున్నా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా తమ దుకాణాలను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం సీఎం సమావేశం పేరుతో దుకాణాలను కూల్చివేసి వందలాది కుటుంబాలను రోడ్డుమీద పడేశారని బాధితులు వాపోయారు. ‘ప్రాధేయపడినా.. వినకుండా మమ్మల్నీ ఈడ్చేసి దుకాణాలను కూలగొట్టి మా పొట్టకొట్టారు. సీఎం సమావేశం కోసం మా దుకాణాలనే ఎందుకు తొలగించారు. మా వీధి వ్యాపారాలపై కోర్టులో కేసు కొనసాగుతున్నప్పటికీ దానిని పరిగణనలోకి తీసుకోకుండా నోటీసు లేకుండా కూల్చివేయడం దారుణం’.అని బాధితుడు ఏడుకొండలు వాపాయారు.