మేడ్చల్/శామీర్పేట, నవంబర్ 14: అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ వైపు అందరు చూస్తున్నారని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం నూతన్కల్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకురాళ్లు అంకుల గీతశ్రీనివాస్ గౌడ్, కల్పన, సైదోనిగడ్డ తండాకు చెందిన యువకులు, శామీర్పేట మండలం బాబాగూడ, మూడుచింతలపల్లి మండ లం జగ్గంగూడ, కొల్తూర్, తదితర గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మంత్రి మల్లారెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ వైపు నడుస్తున్నారన్నారు. స్వాతంత్రం వచ్చిన 75ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం ఈ తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాల నలో జరిగిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాయమాటలు చెప్పి పబ్బంగడపడంతోనే సరిపోయిందని విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. సైదోనిగడ్డకు తండాకు చెందిన బానోత్ శ్రీకాంత్, దారవత్ సంతోష్, లాడియా కిషన్ తదితరులు బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, సర్పంచ్లు కవితాజీవ్, విజయానందారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రణదీప్ రెడ్డి, సురేశ్ రెడ్డి, నాయకులు రాజమల్లారెడ్డి, గోపాల్ రెడ్డి, భద్రారెడ్డి, సుదర్శన్, నిశితారెడ్డి, యూనస్పాష తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి శామీర్పేటకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, సర్పంచ్లు విష్ణువర్ధన్రెడ్డి, హరిమోహన్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, గ్రామీణ మండలాల ప్రధాన కార్యదర్శి సంతోష్రెడ్డి, బాబాగూడ ఉపసర్పంచ్ భాస్కర్రెడ్డి, నాయకులు మురళిగౌడ్, యాదగిరి, రవి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్: పోచారం మున్సిపాలిటీ 2వ వార్డు యం నంపేట్లో మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు చామకూర భద్రారెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి, చైర్మన్ కొండల్రెడ్డి,స్థానిక కౌన్సిలర్ ఎన్.ధనలక్ష్మి కాశయ్య ఆధ్వర్యంలో 150 మంది బీజేపీ,కాంగ్రెస్లోని యువకులు బీఆర్ఎస్ చేరారు.
బోడుప్పల్,: దళితుల అభ్యన్నత్యే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఎస్పీ ఇన్చార్జి చిన్నింగల కుమార్, జిల్లా నాయకులు బీఆర్ఎస్లో చేరికను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. బోడుప్పల్ అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సమావేశంలో వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళితులను మూడు దశాబ్దాలుగా మోసంచేస్తూ పబ్బం గడుపుకున్న రాపోలు రాములుపై మంత్రి నిప్పులు చెరిగారు.
దళితుల సమస్యలు పరిష్కరించక పోగా వారి భూములను అడ్డుపెట్టుకుని 30ఏండ్లుగా పబ్బం గడుపుకున్న రాపోలు రాములు దళితుల ఉసురు తలిగిపోతారని అన్నారు.దళితుల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా దళితబంధు లాంటి బృహత్తర పథకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తూ ముందుకు పోతుంటే దళితుల అవసరాలను ఆసరాగా చేసుకుని లబ్ధిపొంది, కోట్ల రూపాయలు పోగుచేసిన రాపోలు రాములు, కాంగ్రెస్ నేతలు దళితుల ఉసురు తలిగిపోతారని మంత్రి మల్లారెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
బోడుప్పల్ పరిధిలోని 60 కుటుంబాలకు చెందిన దళితుల360 ఎకరాలు పెద్దకంచెను ల్యాండ్ ఫూలింగ్ కింద అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దుష్టశక్తుల్లా అడ్డుకుని 500 చదరపు గజాలు డ్యాక్యుమెంట్ కలిగిన వ్యక్తితో కోర్టులో పిటిషన్ వేసి దళితుల నోటికాడి బుక్కను గుంజుకున్న ద్రోహి రాపోలు రాములని అన్నారు.
బ్యాంకులను, దళితులను మోసంచేసిన అతని దళితుల ఉసురు తలిగిపోతారని శాపనార్థం పెట్టారు. బీఆర్ఎస్ఎన్నో రోజులుగా అపరిషృతంగా మిగిలిపోయిన బోడుప్పల్ వక్ఫ్బోర్డు సమస్యకు పరిష్కారం చూపిన ఘనత సీఎం కేసీఆర్కు, ఐటీ మంత్రి కేటీఆర్కే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, స్థానిక కార్పొరేటర్లు చీరా ల నర్సింహ, సింగిరెడ్డి పద్మారెడ్డి, బీఆర్ఎస్లో మేడ్చల్ జిల్లా బీఎస్పీ నాయకులు చేరిన నాయకులు గోవర్థన్, వినయ్, సుభాష్, సాయిచంద్, విజయ్ రాకేశ్,అనిల్, సోను, ప్రశాంత్, స్థానిక నాయకులు కొత్త రవిగౌడ్.చక్రపాణి గౌడ్, యువజన విభాగం ఉప్పరి విజయ్, మోతెరాజు, కీర్తన్రెడ్డి, విప్లమ్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర భవితవ్యాన్ని కలహాల కాంగ్రెస్ చేతిలో పెడుతారా…నిత్యకృషీవలుడు కేసీఆర్, అభివృద్ధి ప్రధాత చామకూర మల్లారెడ్డి చేతిలో పెడుతారో ప్రజలు తేల్చుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గ దయాకర్రెడ్డి ప్రజలకు సూచించారు. బోడ్పుప్పల్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు చేసినా బీఆర్ఎస్ విజయాన్ని, మంత్రి మల్లారెడ్డి గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, డబ్బులిచ్చి టికెట్ దక్కించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర జంగయ్యయాదవ్, దళితులను ఉపయోగించుకుని ఉసరవెల్లిలా రంగులు మార్చే రాపోలు రాములు చరిత్ర ప్రజలకు తెలుసునన్నారు. వ్యక్తిగత దూషనలకుపోతే వారి చీకటి చరిత్ర ప్రజల ముందు పెడుతానని దర్గా దయాకరెడ్డి ఘాటుగా హెచ్చరించారు.అనంతరం 28వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ చీరాల నర్సింహ, 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఆధ్యర్యంలో ఏర్పాటుచేసిన సమావేశాల్లో పాల్గొన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ, వక్ఫ్బోర్డు సమస్యకు పరిష్కారం చూపిన ప్రభ్వుత్వానికి, కారు గుర్తుకు ఓటేసి హ్యాటిక్ విజయాన్ని అందించాలని మంత్రి మల్లారెడ్డి కాలనీవాసులను అభ్యర్థించారు.