పహడిషరీఫ్, మే 10 : బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుర్హాన్ చెరువు సమీపంలో ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడని సమాచారం అందింది. తలపై రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. మృతుడు ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన అదిత్ పాండే అలియాస్ భజ్రంగ్ (24)గా గుర్తించామన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదులో మున్నా అనే వ్యక్తిపై సందేహం ఉందని తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు.