సిటీబ్యూరో/చిక్కడపల్లి, మార్చి 20 ( నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి లేక రాష్ట్రంలో 40 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డైవర్ల కుటుంబాల ఉసురు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తగులుతుందని ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య పేర్కొన్నారు.
చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారయ్య మాట్లాడుతూ.. ఇటీవల మలక్పేటలో రమేశ్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామన్నారు.