ఖైరతాబాద్, మే 13: నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన లోక్భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు లోక్భవన్ వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం లోక్భవన్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాటలు జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు విచక్షణారహితంగా విద్యార్థులపై లాఠీలను ఝుళిపించారు. పంజాగుట్ట ఏసీపీ మురళీ కృష్ణ స్వయంగా లాఠీతో విద్యార్థులపై విరుచుకుపడడంతో లోక్భవన్ పరసర ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు విద్యార్థులు లాఠీచార్జీలో గాయపడ్డారు.