మాదాపూర్, మే 7: మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఘాటు రెస్టారెంట్ను గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రుచులకు ప్రత్యేకత ఉందని, హైదరాబాద్ అంటేనే రుచికరమైన వంటకాలకు నిలయమని చెప్పారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న మన నగరంలో ఇలాంటి అత్యాధునిక రెస్టారెంట్లు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు.
హైదరాబాద్కు వచ్చే పర్యాటకులకు నాణ్యమైన ఆహారం, మంచి వాతావరణం అందించడంలో ఇటువంటి స్టార్టప్స్, బిజినెస్లు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి కార్తీక్ రాయల, నాయకులు.. రాజి, సీతారాం, అనురాగ్, వెంకట్, భరత్తో పాటు మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సాంబయ్య, భిక్షపతి ముదిరాజ్ తదితరులు ఉన్నారు.