కేంద్రమంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు సాయి భగీరథ్కు మంచి బుద్ధి ఇవ్వాలని బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రార్థించారు. ఈ మేరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
బండి సంజయ్కు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారు అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నామని మహిళా నాయకులు తెలిపారు. బండి సంజయ్కు మంచి బుద్ధి వచ్చి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు. బండి సంజయ్కు కేబినెట్లో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. కేంద్రమంత్రిగా బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రికి ఆయన కొడుకు బండి భగీరథ్కు మంచి బుద్ధి ఇవ్వాలి
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద అమ్మవారిని ప్రార్థించిన బీఆర్ఎస్ మహిళా నాయకులు
కేంద్రమంత్రికి భాగ్యలక్ష్మి టెంపుల్ అంటే ఎంతో ఇష్టం.. అందుకే ఇక్కడికే వచ్చాం
ఆయనకు మంచి బుద్ది వచ్చి కేంద్రమంత్రి పదవికి రాజీనామా… pic.twitter.com/OwzRYpOaXW
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2026
బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో పారదర్శకంగా విచారణ జరగాలని.. ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుండా నిజాలు బయటపెట్టాలని దర్యాప్తు అధికారులకు సూచించారు. అమ్మవారి సాక్షిగా నిజాలు బయటపడాలని అన్నారు. మైనర్ బాలిక అంశంలో రాజకీయ ప్రభావం ఉండకూడదని అభిప్రాయపడ్డారు.