మేడ్చల్/మేడ్చల్ కలెక్టరేట్/శామీర్పేట/జవహర్నగర్/ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 21 : బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, జవహర్నగర్లలో బుధవారం క్రిస్మస్ కానుకల పంపిణీ జరిగింది. తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, జవహర్నగర్లలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉన్నత పాలనతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారన్నారు. అన్ని మతాలకు సమా న ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, హరితహారం లాంటి ఎన్నో కార్యక్రమాలు వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్ దేశంలో తన సత్తా చాటుతుందన్నారు.వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రజల తెలంగాణ పాలనను మోడల్గా భావిస్తున్నారని తెలిపారు.
క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు సంతోషంగా ఉండాలన్న కాంక్షతో నూతన వస్త్రాలను సీఎం కేసీఆర్ పంపిణీ చేస్తున్నారని తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ మర్రిదీపికానర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు గణేశ్, నర్సింహస్వామి యాదవ్, సాయికుమార్, నాగరాజు, శివకుమార్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ యాదవ్, మహేశ్, కో ఆప్షన్ సభ్యులు మహబూబ్ అలీ, గీత, నాయకులునర్సింహారెడ్డి, సందీప్ గౌడ్, నరేందర్ పాల్గొన్నారు. దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీలలో జరిగిన కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్లు వాణిరెడ్డి, స్వామి, వైస్ చైర్మన్లు నరేందర్ రెడ్డి, మల్లేశ్, పార్టీ అధ్యక్షులు శ్రీధర్, తిరుపతి రెడ్డి, కౌన్సిలర్లు, కో-అఫ్షన్ సభ్యులు, నాయకులు, పాల్గొన్నారు.
తూంకుంట మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణి, కమిషనర్ జేతూరాం, కౌన్సిలర్లు పాండు, మధుసూదన్రెడ్డి, రాజ్కుమార్యాదవ్, హరిబాబు, సురేశ్, నర్సింగ్రావు,దేవరయాంజాల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ప్రణయ్కుమార్, గోపాల్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. జవహర్నగర్లో జరిగిన కార్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, వైస్ ఎంపీపీ జంగమ్మ, ఎంపీడీవో అరుణ, ఎంపీవో నందకిశోర్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.