KTR | దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని ఆదివారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేటీఆర్.. లాస్యనందిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె తల్లి, సోదరిని ఓదార్చారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారన్న వార్త విని షాక్కు గురయ్యానని చెప్పారు. విదేశాల్లో ఉండటం వల్ల ఆమె అంత్యక్రియలకు హాజరు కాలేపోయానని తెలిపారు. లాస్యనందిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్, మాజీ ఎమ్మెల్యే బాలరాజు తదితరులు ఉన్నారు.
– కంటోన్మెంట్, ఫిబ్రవరి 25