మామిళ్లగూడెం, జనవరి 17 : బుధవారం (ఈ నెల 18) ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం వైరా హైవేలో రాకపోకలు సాగించే సాధారణ వాహనాలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దారి మళ్లించనున్నారు. సభ నేపథ్యంలో ఐదు రోజులుగా ఐజీ చంద్రశేఖర్రెడ్డి, వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనర్లు ఏవీ రంగనాథ్, విష్ణు ఎస్ వారియర్లు సమాలోచనలు చేశారు. సభ జరిగే ప్రాంతాలు, ట్రాఫిక్ ఏరియాలు, దారి మళ్లింపులకు తీసుకోవాల్సిన జాగ్రతలపై కసరత్తు చేసి రూట్ మ్యాప్ను విడుదల చేశారు.
రాష్ట్రంలోని 31 జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్నాటక, ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ర్టాల నుంచి ప్రజలు, ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో నూతన కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో దేశ ప్రజలకు దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో ఖమ్మం మీదుగా వచ్చిపోయే సాధారణ, భారీ వాహనాల ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖమ్మం మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటున్నందున ప్రజలు అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోవాలని పోలీసులు సూచించారు. లేదంటే పోలీసు శాఖ నిర్దేశించిన రూట్లలోనే ప్రయాణించాలన్నారు.
పార్కింగ్ స్థలాలు వాహనాలు చేరుకునే మార్గాలు..