రామంతాపూర్: మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కులేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తాను అందరికీ అందుబాటులో ఉంటానని, మీ బస్తీలో కష్టాలు తీరుస్తానని చెప్పారు. హబ్సిగూడ, రామంతాపూర్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాగిడి మాట్లాడుతూ మల్కాజిగిరి ప్రజలు ఆలోచించి..తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆయా సమావేశాల్లో ఉప్పల్ ఇన్చార్జి జహంగీర్ పాషా, నాయకులు పసుల ప్రభాకర్రెడ్డి, డాక్టర్ బీవీచారి, సోమిరెడ్డి, మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్ననాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.