Padma Rao Goud | బేగంపేట/ఉస్మానియా యూనివర్సిటీ/ఖైరతాబాద్ మే 9: సనత్నగర్ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్ పాటిగడ్డ, ఎంబీటీనగర్, వికార్నగర్, వడ్డెరబస్తీ, తబేలా ప్రాంతాల్లో గురువారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా మహిళలు మంగళహారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ..ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుందో ఆలోచించి.. ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి కూడా నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దన్నారు. తార్నాక డివిజన్ మాణికేశ్వరీనగర్లోనూ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ విస్తృతంగా పర్యటించారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అలాగే రాత్రి ఖైరతాబాద్లో పద్మారావుగౌడ్ రోడ్షోను నిర్వహించారు. దానం నాగేందర్ పంజాగుట్టలో బీడీలు, సిగరేట్లు అమ్ముకునేవాడంటూ.. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గ ప్రజల సమక్షంలో చేసిన వ్యాఖ్యలను మరిచిపోయినట్లు ఉన్నారని..ప్రభుత్వం మారగానే రేవంత్ కాళ్లపై పడ్డాడు’ అంటూ.. పద్మారావుగౌడ్ ఈ రోడ్ షోలో దానం నాగేందర్ను ఎద్దేవా చేశారు.