మల్కాజిగిరి, ఏప్రిల్ 19: రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్లోని ఆర్చి బిషప్ కార్యాలయంలో కార్డినల్ పూల ఆంటోనిని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కోసం రుణాలను మంజూరు చేసిందని, విదేశాల్లో చదువుకునేందుకు విద్యార్థికి ఆర్థిక సహాయంగా రూ. 20 లక్షలు మంజూరు చేయడంతో వందలాది మంది క్రిస్టియన్ యువకులు వివిధ దేశాల్లో విద్యనభ్యసిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు లియోనార్డ్, మహేశ్, లియో, తిమోతి, ఆనంద్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.