కుత్బుల్లాపూర్, మార్చి8 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ పథకం కింద ఎన్నో చెరువులను అభివృద్ధి పరిచి మురుగునీరు కలవకుండా మురుగునీరు మళ్లింపు చర్యలు చేపట్టి సమీప కాలనీ వాసులకు ఉపయోగపడేలా ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేసే విధంగా చెరువులను అభివృద్ధి పరచాలని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు.
శనివారం పేట్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబిర్ చెరువు పరిరక్షణకై చేపట్టవలసిన చర్యలపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులు, నిజాంపేట్ కార్పొరేషన్కు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి 22వ డివిజన్ ఎన్ఆర్ఐ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సిసి రోడ్డు, డ్రైనేజీ పనులపై కాలనీవాసులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, ఇరిగేషన్ డిఈ నరేంద్ర, మున్సిపల్ డీఈ దాసయ్య, ఏఈ లక్ష్మీ నారాయణ, నాయకులు శ్రీకర్ గుప్తా, జశ్వంత్, సాంబశివారెడ్డి, శిల్ప, సాయి, ప్రదీప్, గురుమూర్తి, ఎన్ఆర్ఐ కాలనీ వాసులు సాయిరాజ్, సుబ్బరాజు, శివ, తేజ, త్రినేత్ర రావు తదితరులు పాల్గొన్నారు.