కంటోన్మెంట్, ఏప్రిల్ 19: బీఆర్ఎస్తోనే కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత కోరారు. ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటో వార్డు పరిధిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి నివేదిత పర్యటించారు.
న్యూ బోయిన్పల్లి పెద్దతోకట్ట, కంసాలి బజార్తో పాటు పలు బస్తీల్లో పాదయాత్ర చేశారు. ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలు పంచుకుంటున్న తనను ఆశీర్వదించి గెలిపిస్తే సేవకురాలిగా పని చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రామకృష్ణ, రాము, పద్మ, అంబిక, సబిత తదితరులు పాల్గొన్నారు.