మల్కాజిగిరి జోన్ బృందం, అక్టోబర్ 28: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని..హాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్కు అడ్డు ఎవరులేరని మల్కాజిగిరి నియెజవకర్గం బీఆర్ఎస్ అభ్య ర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం వినాయకగర్లో నాయకులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు ప్రతి నిత్యం అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపా రు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అలాగే.. ఈస్ట్ ఆనంద్బాగ్, మచ్చ బొల్లారం, మల్కాజిగిరి, అల్వాల్ డివిజన్లలోని బస్తీలు, కాలనీల్లో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి ప్రచారం చేశారు. అలాగే పలు ప్రాంతాల్లో జరిగిన పార్టీ నాయకుల సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్య ర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మీకు సేవ చేయడానికి వచ్చా ను.. తనను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. బస్తీల్లో నివసిస్తున్న వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు.
నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. అలాగే.. పలు పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్ మురుగేశ్, మాజీ కార్పొరేటర్లు జగదీశ్గౌడ్, ఆకుల నర్సింగరావు, సర్కిల్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, బద్దం పరశురాంరెడ్డి, జేఏసీ వెంకన్న, హుడా మాజీ డైరెక్టర్ వీరేషం యాద వ్, ఖలీల్, రమేశ్, సర్కిల్ మహిళా అధ్యక్షురాలు పల్లె విజయకుమారి, నాగకుమారి, తదితరులు పాల్గొన్నారు.