ఉప్పల్/ చర్లపల్లి/కాప్రా/మల్లాపూర్, అక్టోబర్ 13 : ప్రజాసేవకుడిగా ప్రజల మధ్యలో ఉన్నానని, మీ ఆశీర్వాదం ఉండాలని ఉప్పల్ బీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్ బీఆర్ఎస్పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు సేవలందించడానికే ప్రజాక్షేత్రంలోకి వచ్చానని, రాజకీయాలలో కూడా ప్రజల కోసమే పనిచేస్తానన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు తనవంతు సహాయ, సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.
ప్రజాసంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా తనవంతు తోడ్పాటు అందించామన్నారు. బీఆర్ఎస్పార్టీ కుటుంబసభ్యులు సమన్వయంతో పనిచేసి, బీఆర్ఎస్పార్టీని గెలిపించాలన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ౫ సంవత్సరాలు మీ కోసం పనిచేస్తామన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్తానని తెలిపారు. మీ కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని, మీ ఆశీస్సులు ఉండాలన్నారు. కష్టపడి పనిచేసి, బీఆర్ఎస్పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ అన్నారు. నేతలు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, అధ్యక్షుడు పల్లె నర్సింగ్రావు, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాచారంలోని బీఆర్ఎస్పార్టీ కార్యాలయంలో మహిళల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడుతూ.. మహిళలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మహిళల అభ్యున్నతికి ఎంతో తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంలో మహిళలు ముందుకురావాలని సూచించారు. దేశంలో మహిళా బిల్లు తీసుకురావడంలో బీఆర్ఎస్పార్టీ పోరా టం కీలకమైందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో షేర్ మణెమ్మ, కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, గంధం జ్యోత్న్సనాగేశ్వర్రావు, పలు డివిజన్ల అధ్యక్షులు, మహిళ నేతలు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో బీఆర్ఎస్కు
నియోజకవర్గంలో బీఆర్ఎస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుందని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్కు చెందిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, నాయకులతో ఆయన కలిసి ఎన్నికల సరళి, అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు. బీఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నా రు. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగడంతో పాటు ఇత ర పార్టీల నుంచి అత్యధికంగా చెరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు నాగిళ్ల బాల్రెడ్డి, కనకరాజుగౌడ్, నారెడ్డి రాజేశ్వర్రెడ్డి, సానెం రాజుగౌడ్, బత్తుల శ్రీకాంత్యాదవ్, కొమ్ము సురేశ్, కొమ్ము రమేశ్, భానుచందర్ పాల్గొన్నారు.
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. డివిజన్లవారీగా ప్రచార బృందాలను ఏర్పాటు కావడంతో కాలనీలవారీగా వ్యూహాత్మకంగా ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఆ పార్టీకి చెందిన క్యాడర్లలో అయోమయం నెలకొంది. ఎవరు అభ్యర్థులుగా వస్తారో, ఆ అభ్యర్థి స్థాయి ఏమిటో తెలియని స్థితిలో ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు కొట్టుమిట్టాడు తున్నారు. మరోవైపు ఈ అగమ్యగోచర పరిస్థితి కొనసాగుతుండగానే కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు ఆఖర్షితులై బీఎల్ఆర్ ట్రస్టు ద్వారా ఎంతో మందికి ఆర్థిక సహాయం చేస్తున్న, అందరికీ సుపరిచితుడైన బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటంతో బీఆర్ఎస్కు మద్దతు తెలిపేవారు రోజు, రోజుకూ పెరిగి పోతున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి నివాసం, పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతమైన కాప్రాడివిజన్లో ఇప్పటికే బీఆర్ఎస్ ఎంతో బలంగా ఉంది. అయితే ఈ డివిజన్లో పార్టీని, క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసే ప్రక్రియలో బీఎల్ఆర్ సఫలీకృతమైనట్టు చెప్పవచ్చు. ఇటీవల ఎల్లారెడ్డిగూడ మల్లారెడ్డి గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి భారీగా నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయడమే ఇందుకు నిదర్శనం. ఆ మరునాడే నాయకులు, కార్యకర్తలు మరోసారి సమావేశమై ప్రచార కార్యక్రమానికి వ్యూహరచన చేసి, బుధవారం నుంచి ఇంటింటికీ ప్రచారం చేపట్టారు.
గురువారం సాయిబాబానగర్లో జరిగిన ఎన్నికల ప్రచారానికి స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు హాజరు కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. కార్పొరేటర్ స్వర్ణరాజు, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సుడుగు మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు బైరి నవీన్గౌడ్ ఆధ్వర్యంలో గులాబీ దండు ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని, కారు గుర్తుకే ఓటేయాలని కోరుతూ కాలనీలోని వీధులను చుట్టుముట్టింది. ఇండ్లను, దుకాణాలను, ఇతర సంస్థలను కలియ తిరుగుతూ మహిళలను, వృద్ధులను, యువతను పలుకరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ నాయకులు, కార్యకర్తలు ముం దుకు కదిలారు. కార్యక్రమంలో నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నాచారంలో
నాచారంలోని ఎరుకల బస్తీలో శుక్రవారం బీఆర్ఎస్పార్టీ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. కాలనీలో పాదయాత్ర చేస్తూ, బీఆర్ఎస్పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిలువాలని కోరారు. ఇంటింటికీ తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయని తెలిపారు. త్వరలోనే పనులు చేపడతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. మేకల ముత్యంరెడ్డి, రమేశ్, సీను, లడ్డు శివ, శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు.
నవంబర్ ౩౦వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మల్లాపూర్ డివిజన్ ఎస్.ఎల్.ఎన్.ఎస్ ఫంక్షన్హాల్లో ఆయన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అందరు సమన్వయంతో పని చేసి ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా లక్ష్మారెడ్డి గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.