Narsingi Water Crisis | రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగిలో మహిళలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ‘వాక్ ఫర్ వాటర్’ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నార్సింగి చౌరస్తా నుండి వాటర్ వర్క్స్ ఆఫీస్ వరకు మహిళలతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డిని కలిసి తాము ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను కాలనీ వాసులు వివరించారు. ఆయనకు వినతిపత్రం అందజేశారు.
పాదయాత్ర అనంతరం బహిరంగ సమావేశంలో కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ప్రజలకు నాలుగు రోజులు కూడా సక్రమంగా మంచినీరు ఇవ్వలేకపోతున్నాడని మండిపడ్డారు. మంచినీటి సరఫరాపై స్థానిక ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేకపోవడం వల్లే ప్రజలకు ఈ కష్టాలు వచ్చాయని అన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నార్సింగిలో మహిళలతో కలిసి ‘వాక్ ఫర్ వాటర్’ పాదయాత్ర చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు @KarthikIndrAnna
నియోజకవర్గంలో నెలకొన్న తీవ్ర మంచినీటి సమస్యపై చేపట్టిన ‘వాక్ ఫర్ వాటర్’ పోరాటం శరవేగంగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా నార్సింగి చౌరస్తా నుండి వాటర్… pic.twitter.com/cWHLsnZHHH— BRS Party (@BRSparty) May 17, 2026
నియోజకవర్గంలో సరిపడా నీటిని అందిస్తున్నామని అధికారులు చెప్పడం వివేక శూన్యమని విమర్శించారు. పాదయాత్ర పొడవునా కనిపిస్తున్న వాటర్ ట్యాంకర్లే ఇక్కడి నీటి ఎద్దడికి ప్రత్యక్ష నిదర్శనమని మండిపడ్డారు. మేము మంచినీటి సమస్యపై పోరాటం ప్రారంభిస్తున్నామని తెలిసి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆఘమేఘాలపై అధికారులతో చర్చలు జరిపారని అన్నారు. ఇప్పటివరకు ఆయనకు ప్రజల సమస్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.