ఉప్పల్, మార్చి 26 : రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సాధిస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాచారంలోని ఏఎన్ఆర్ గార్డెన్లో ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ఆత్మీయ సమ్మేళనం జిల్లా ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్పార్టీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమంలో సీఎం కేసీఆర్ మహానాయకుడు, మహాత్ముడన్నారు. కాంగ్రెస్ పార్టీ దివాళ తీసిన పార్టీ, బీజేపీ దరిద్రపు పార్టీ అన్నారు. బీజేపీకి సంస్థలను అమ్మడం మాత్రమే తెలుసన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. 30 లక్షల మంది ఇతర రాష్ర్టాల కార్మికులకు తెలంగాణ రాష్ట్రం ఉపాధిని అందిస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యత ఉండాలన్నారు. ఉద్యమకారులు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా ఉప్పల్కు ఒక గుర్తింపు ఉందన్నారు. దేశంలోనే అత్యధిక ప్రజాప్రతినిధులు కలిగిన పార్టీగా బీఆర్ఎస్ ఉందన్నారు. ఉద్యోగాల కల్పన పారదర్శకంగా చేపట్టి, ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. లీకేజీని కనిపెట్టి, పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చూస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, శాంతిసాయిజెన్ శేఖర్, బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, బొంతు శ్రీదేవి, జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్రెడ్డి, కొత్త రామారావు, ధన్పాల్రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మేకల ముత్యంరెడ్డి, సుడుగు మహేందర్రెడ్డి, కాసం మహిపాల్రెడ్డి, వేముల సంతోష్రెడ్డి, పల్లా కిరణ్కుమార్రెడ్డి, డా.బీవీ.చారి, పల్లె నర్సింగ్రావు, నేతలు జనంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, కాటేపల్లి రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
మీ కష్టమే మా పదవులు..మీకు న్యాయం చేస్తాం
ఉద్యమకారులు, కార్యకర్తలు, నేతలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాం. ఉద్యమకారుడే మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు.. అందరికీ న్యాయం చేస్తాం. మీ కష్టాలు తెలిసిన నాయకుడిగా కార్యకర్తలకు అండగా ఉంటా. నాకు కార్యకర్తలు, నేతలే కుటుంబం.. మీరు లేనిది మేములేం. మీ కష్టమే మాకు పదవులుగా వచ్చాయి. రాబోయే రోజుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి.
– బేతి సుభాష్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే
బాధలు తెలిసిన పార్టీ బీఆర్ఎస్..
ఉద్యమ పార్టీగా, ప్రజల బాధలు తెలిసిన పార్టీగా బీఆర్ఎస్ ఉన్నది. అందుకే ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రజల అవసరాలు గుర్తించి, నిధులు మంజూరు చేసి సమస్యలు శాశ్వతంగా పరిష్కరించారు. చిలుకానగర్ ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం అభినందనీయం. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి చొరవతో చాలా మేరకు పనులు పూర్తి చేస్తున్నారు.
– బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, చిలుకానగర్ డివిజన్
ఆదర్శంగా నిలుస్తుంది
ఉప్పల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తాయి. మరోసారి ఎమ్మెల్యేగా బేతి సుభాష్రెడ్డిని గెలిపించుకుంటాం. ఉప్పల్ కారిడార్, ఫ్లైఓవర్లు, స్కైవాక్, శిల్పారామం, థీమ్పార్కులు, వైకుంఠధామాలు, మల్టీలెవల్ ఫంక్షన్హాళ్లు, తదితర అభివృద్ధి ఫలాలు కండ్లకు కనిపిస్తున్నాయి. ప్రజల కష్టాలను తెలుసుకొని, పనిచేయడం అభినందనీయం. వరద ముంపులు లేకుండా, చెరువుల సుందరీకరణ, రిజర్వాయర్లు, బాక్స్ కల్వర్టులతో దీర్ఘాకాలిక సమస్యలు తీరుతున్నాయి.
– జనంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, హబ్సిగూడ
ఉద్యమకారులకు న్యాయం
నియోజకవర్గంలో ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉద్యమకారుడికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించడంతో అందరిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నారు. సీఎం కేసీఆర్ చొరవ, మంత్రి కేటీఆర్ తోడ్పాటు, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి శ్రమతో నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి సాగుతుంది. ప్రజల కష్టాలను తెలిసిన పార్టీగా, ఉద్యమపార్టీగా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుంది.
– కాసం మహిపాల్రెడ్డి, ఏఎస్రావునగర్ డివిజన్
ఎన్నో సమస్యలకు మోక్షం
నాచారం డివిజన్లో వరద ముంపు లేకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాం. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక, దశాబ్దాలుగా పరిష్కారం కాని నాచారం బ్రిడ్జి సమస్య తొలగిపోయింది. నాచారంలో దోమల సమస్యలకు పరిష్కార చర్యలు చేపట్టాం. చెరువుల సుందరీకరణ, నాలాల ఆధునీకరణ చేపట్టాం. బస్తీవాసులకు ఎలాంటి ముంపు సమస్యలు లేకుండా యూజీడీ పనులు చేపట్టాం. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, తదితర మహిళల కోసం తీసుకువచ్చిన పథకాలు ఆదర్శం.
– శాంతిసాయిజెన్ శేఖర్, నాచారం
కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్
కార్మికులకు అండగా నిలిచారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కార్మికులకు న్యాయం జరిగింది. ప్రమాద బీమాతోపాటు కార్మికుల కష్టాలను తీర్చారు. ఎంతో మంది కార్మికుల సంక్షేమానికి పలు పథకాలను తీసుకువచ్చారు. భవన నిర్మాణం, ఆటో కార్మికులకు గత ప్రభుత్వాల్లో లేని విధంగా సంక్షేమ నిధులు పెంచారు.
– వేముల మారయ్య, ఆటో యూనియన్ అధ్యక్షుడు
మైనార్టీలకు అండగా నిలిచారు..
నియోజకవర్గంలోని మైనార్టీలకు బీఆర్ఎస్ పార్టీగా అండ గా ఉంటుంది. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభు త్వం పలు సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. షాదీముబారక్, మైనార్టీ గురుకులాలు, స్కాలర్షిప్లు అందజేయడాన్ని స్వాగతిస్తున్నాం. రంజాన్ మాసంలో మైనార్టీలకు అండగా నిలుస్తుంది.
– బద్రుద్దీన్, మైనార్టీ నాయకుడు, కాప్రా