ముషీరాబాద్, నవంబర్ 16: పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు అండ గా నిలవాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో గత ఐదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన అడిక్మెట్, ముషీరాబాద్ డివిజన్లలోని పలు బస్తీల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ ఎన్నికల ప్రచా రం నిర్వహించారు.
నేరుగా ఓటర్లను కలిసి ముఠా గోపా ల్ మీ బస్తీల్లో రోడ్డు వేసింది, నిరంతరం కరెంటు, మంచినీరు సరఫరా చేస్తున్నది గమనించి ఓట్లు వేయాలని కోరారు. ప్రజల మధ్య ఉండి నిత్యం ప్రజా హితం కోసం పరితపించే నేతను ఎన్నుకోవాలని కోరారు. తాను ఎమ్మెల్యే గెలిచిన తరువాత అడిక్మెట్ డివిజన్లో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
మూడు దశాబ్దాలుగా పరిష్కారం నోచుకొని లలితానగర్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన ఘనత తమదేన్నారు. ప్రతి బస్తీలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతోపాటు అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తున్నామని, పని చేసే ప్రభుత్వానికి ఓటు ద్వారా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని సమస్యలను పరిష్కరించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, అభివృద్ధిని కొనసాగించడానికి బీఆర్ఎస్ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం చరిత్రంతో ఎన్నడూ లేనివిధంగా వెయ్యి కోట్లకు పైగా నిధు లు తీసుకువచ్చిన అభివృద్ధి పనులు చేట్టానని, వరద సమస్యలను పరిష్కరించిన ఘనత తనదేనన్నారు.
నియోజకవర్గానికి ఎన్నికలప్పుడు వచ్చేపోయే నేతలు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, పని చేసేటోళ్లకు ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, బి.శ్రీనివాస్రెడ్డి, నర్సింగ్ప్రసాద్, టి. సోమసుందర్, ఇంద్రసేనారెడ్డి, మాధవ్, కె. సురేందర్, రవియాదవ్, శ్యామ్సుందర్, చంద్రశేఖర్గౌడ్, నేత శ్రీనివాస్, మహ్మద్ ఖదీర్, రాజు, కిశోర్, సత్యనారాయణ, ప్రేమ్కుమార్, అనూరాధ, ప్రేమలతారెడ్డి, ఆకుల అరుణ్, శ్రీధర్రెడ్డి, ఎయిర్టెల్ రాజు, భిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.