సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఒకే విద్యా సంవత్సరంలో రెండు రకాల డిగ్రీలు చేయడం వల్ల యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. సోమవారం జేఎన్టీయూలో యూజీసీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అఫిలియేటెడ్ ప్రిన్సిపాళ్ల ఇంటరాక్షన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో కొత్తగా బీబీఏ-డాటా అనలైటిక్స్ అనే కొత్త కోర్సును 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశ పెట్టామన్నారు. అలాగే తమ యూనివర్సిటీ పరిధిలో జాతీయ విద్యా విధానం అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ గో వర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్హుస్సేన్, కార్యక్రమ సమన్వయకర్త ప్రొఫెసర్ కృష్ణమోహన్, అఫిలియేషన్ కాలేజీల ప్రిన్సిపాళ్లు యూనివర్సిటీ ప్రొఫెసర్లు తదితరులు హాజరయ్యారు.