సిటీబ్యూరో,జనవరి 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో ఉన్న చరిత్రాత్మక మూసీ, ఈసీ నదులపై 15 చోట్ల కొత్తగా వంతెనలను నిర్మించనున్నారు. ఇందుకోసం అవసరమైన రూ.545 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రెండు నదులపై 13 చోట్ల హైలెవల్ వంతెనలు, ఒకటి పాదచారుల వంతెన నిర్మించేందుకు అనుమతులు జారీ చేసింది. ఇందుకు అవసరమైన నిధులను హెచ్ఎండీఏ 50 శాతం అందించనుండగా మిగతా 50 శాతం నిధులను జీహెచ్ఎంసీ బ్యాంకుల ద్వారా సేకరించి ఇవ్వనున్నది. వంతెనల నిర్మాణంపై ఇప్పటికే హెచ్ఎండీఏ పూర్తిస్థాయిలో కసరత్తు చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను పంపించింది. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం పనులు చేపట్టేందుకు అవసరమైన పరిపాలనా అనుమతులను ఇస్తూ శనివారం జీవో ఆర్టీ నం.37ను జారీ చేసింది.
మూసీ, ఈసీ నదులపై నిర్మించే వంతెనలు- అయ్యే ఖర్చు
ఆఫ్జల్ గంజ్ వద్ద ఐకానిక్పెడెస్ట్రియన్ బ్రిడ్జి – 40 కోట్లు
కారిడార్ 99లో మిస్సింగ్ లింక్ను హైలెవల్ బ్రిడ్జి – 52 కోట్లు
ఇబ్రహీంబాగ్ కాజ్వేను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి – 39 కోట్లు
ఈసీ నదిపై సన్సిటీ-చింతల్మెట్ ప్రాంతాలను కలుపుతూ పవర్కారిడార్ కింద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం – 32 కోట్లు
రాజేంద్రనగర్ ఇన్నర్ రింగు రోడ్డును నుంచి కిస్మత్పూర్ రోడ్డును కలుపుతూ ఈసీ నదిపై బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో హైలెవల్ బ్రిడ్జి – 32 కోట్లు
మూసారంబాగ్ వద్ద హైలెవల్ బ్రిడ్జి- 52 కోట్లుచాదర్ఘాట్ను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి -42 కోట్లు
మూసీ నదిపై అత్తాపూర్ వద్ద ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జి- 35 కోట్లు
ఉప్పల్ భగాయత్ లే అవుట్ నుంచి దక్షిణ వైపు కొత్త బ్రిడ్జి- 42 కోట్లు
మంచిరేవుల గ్రామం-నార్సింగిల మధ్య హైలెవల్ బ్రిడ్జి- 39 కోట్లు
ఈసీ నదిపై బుద్వేల్ ఐటీ పార్క్స్ను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి- 32 కోట్లు
హైదర్షాకోట్ నుంచి రాందేవ్ గూడ వరకు హైలెవల్ బ్రిడ్జి – 42 కోట్లు
ఈసీ నదిపై బుద్వేల్ ఐటీ పార్క్స్లను కలుపుతూ రెండో బ్రిడ్జి నిర్మాణంతో పాటు సమాంతరంగా రోడ్ల నిర్మాణం -20 కోట్లు
ప్రతాపసింగారం నుంచి గౌరెల్లి వరకు హైలెవల్ బ్రిడ్జి- 35 కోట్లు
మంచిరేవుల బ్రిడ్జి వరకు కొత్తగా లింక్ రోడ్డు నిర్మాణం రూ.11 కోట్లు