కాంగ్రెస్ ధరణి బంద్ చేస్తే పాత రోజులు వస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ పనులు మానుకొని తిరుగాల్నా? గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మ్యూటేషన్ కావాలన్నా చాల రోజులు పడుతుండే. ధరణితో ఆ సమస్యలు అన్నీ తీరినై. గ్రామాల్లో భూముల పంచాయితీలు తక్కువయ్యాయి. సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు మంచిగున్నరు. రికార్డులు సక్కగా ఉన్నవి. మన వేలు ముద్ర వేస్తే తప్ప భూమి వేరొకరి పేరు మీదకు మారదు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నాం.
– వెంకటేశ్, రాంపల్లి, మేడ్చల్ జిల్లా
కాంగ్రెస్ ధరణి ఎత్తివేస్తే పాత రోజులు వస్తాయి. గతంలో వారి పాలనలో ఉన్నప్పుడు రైతుల భూములకు రక్షణ లేకుండా పోయి ంది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నా రు. మన భూములు మన పేరు మీదనే లేవు. ఆ కష్టాలు మళ్లీ తీసుకొస్తరా? ఆఫీసుల చుట్టూ రైతులను తిప్పదల్చుకున్నరా?. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పెట్టి ప్రతి రైతుకు పట్టాదారు పాస్పుస్తకాలు అందించారు. ధరణిలో ఏ రైతుకు ఎంత భూమి ఉన్నది తెలుసుకోవడం సులువు. అందుకే రైతులందరం సీఎం కేసీఆర్నే బలపర్చుదాం.
– మంచాల బాబు, రాంపల్లి, మేడ్చల్ జిల్లా
కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టాదారులకు లేదా కౌలు రైతులలో ఎవరో ఒకరికి రైతుబంధు ఇస్తామంటున్నారు. దీంతో కౌలు రైతులకు భూములు ఎవ్వరు ఇవ్వరు. కౌల్దారీ చట్టంతో కౌలుదారులకు రైతులకు కొట్లాటలు అవుతాయి. భూమి ఉన్న రైతులు తమ అవసరాల నిమిత్తం వేరే ప్రాంతాల్లో ఉంటూ… గ్రామాల్లోని ఇతర రైతులకు కౌలుకు ఇస్తున్నారు. కానీ కౌలుదారు చట్టం చేస్తే పట్టాదారులు తమ పొలాలను కౌలుకు ఇవ్వరు. ధరణితోనే భూములు భద్రంగా ఉన్నాయి. రైతుకు అండగా ఉన్న బీఆర్ఎస్కే మా మద్దతు.
– చీర ఆంజనేయులు, రాంపల్లి, మేడ్చల్ జిల్లా
కౌల్దారీ పద్ధతి అమలైన కాంగ్రెస్ హయాంలో చాలా ఇబ్బందులు పడ్డాం. పట్వారీలు, వీఆర్వోలు పైరవీదారులకు సహకరిస్తే రైతుకు నష్టం కలుగుతుంది. హక్కుగా సాధించుకునే పాసుబుక్కు, పత్రాల మార్పునకు పైరవీ చేయాల్సి వస్తుంది. దీనికోసం అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరగడంతోపాటు భారీగా డబ్బులు ఖర్చు చేయక తప్పదు. ప్రస్తుతం ధరణితో ఒకేచోట పనులన్నీ జరగడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. మళ్లీ కేసీఆర్నే గెలిపించుకుంటేనే రైతులకు సాయం పెరగడంతోపాటు వ్యవపాయం లాభసాటిగా మారుతుంది.
– కృష్ణ, దుండిగల్ గండిమైసమ్మ, మేడ్చల్ జిల్లా
బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుంది. అప్పుడే రైతులకు అన్ని విధాలా సాయం అందుతది. మరోసారి అధికారంలోకి వచ్చాక సాయం పెంచుతామని భరోసా కూడా ఇచ్చారు. కౌలు విధానంలో ఉన్న లోపాలను గత పాలకుల హయాంలో చూశాం. తక్కువ సేపు కరెంట్, అదనపు భారంతో మోటర్లు.. ఆపై మీటర్ల విధానం తగదు. వ్యవసాయ రంగం దెబ్బతింటే దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. వలసలు పెరగడంతో తలసరి ఆదాయం కూడా తగ్గుతుంది. అందుకే ఉన్న పాలనను మెరుగు పరచుకోవడమే సరైన మార్గం.
– శివరాత్రి యాదగిరి, విద్యావేత్త, కుత్బుల్లాపూర్ ఉద్యమ ఐకాస కన్వీనర్
పదేండ్లుగా వ్యవసాయానికి ప్రోత్సాహం అందడంతో నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూమికి విలువ భారీ గా పెరిగింది. కాంగ్రెస్ చెబుతున్నట్టు రైతు వ్యతిరేక విధానాలు తీసుకొస్తే వ్యవసా యం, పంటల విస్తీర్ణం భారీ గా పడిపోయి ఆహార ఉత్పత్తుల ధరలు ఆకాశనంటుతాయి. కౌల్దారీ పద్ధతిలో భూములపై గొడవలు, పంచాయితీలు తీవ్రమవుతాయి. ఇంతకాలం రైతుల కోసం చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన ఖర్చు వృథాగా మారడంతోపాటు రైతులు ఆర్థికంగా కుదేలవుతారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. మా మద్దతు బీఆర్ఎస్ పార్టీకే.
– పోలేపల్లి వెంకట్రామ్రెడ్డి, రైతు సంఘం నేత
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో మా భూములకు భరోసా కలిగింది. రిజిస్ట్రేషన్లు త్వరగా జరుగుతున్నాయి. 15 రోజుల్లోనే పాస్బుక్ ఇంటికి వస్తున్నది. ఎవరికి లంచం ఇవ్వాల్సిన పనిలేదు. నా పేరిట ఉన్న భూమికి నేను సంతకం, వేలు ముద్ర పెడితే తప్ప ఇంకొకరికి మారదు. ఇది చాలా మంచి పద్ధతి. పట్వారీ, వీఆర్వోలు ఉన్నప్పుడు ఒకరి భూమి మరొకరికి ఇష్టమొచ్చినట్లు మార్చేవారు. ఆరోజుల్లో రైతుల గోసలు అంతాఇంతా కాదు. కేసీఆర్ పాలనలో ఇప్పుడు అట్లా లేదు. ధరణితో మంచి జరిగింది.
– కంతి దయాకర్,రాందాస్పల్లి( ఆదిబట్ల)
ధరణితో భూసమస్యల్లేవు. ఒకేసారి రిజిస్రేష్టన్, మ్యూటేషన్ ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తవుతున్నది. పారదర్శకం గా సేవలు అందుతున్నాయి. అధికారు లు, కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు. అరగంటలోనే రిజిస్ట్రేషన్, మ్యూ టేషన్ పూర్తి చేసి పట్టా పాస్బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలను అందిస్తున్నారు. ధరణి వచ్చిన తర్వాత రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. భూసమస్యలకు ధరణితో మేలు జరుగుతుంది. కాంగ్రెసోళ్లు ధరణిని రద్దు చేసి భూమాత పోర్టల్ను తీసుకొస్తే రైతుల జీవితాలు ఆగమవుతాయి. మళ్లీ రైతులకు పాత రోజులే వస్తాయి.
-ఏనుగు బుచ్చిరెడ్డి, ఇబ్రహీంపట్నం రూరల్
కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతుంది. కాంగ్రెస్ మూడు గంటల కరెంట్తో ఒక్క మడి కూడా తడవని పరిస్థితి నెలకొంటుంది. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాల సరఫరా వంటి సంక్షేమ కార్యక్రమాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటున్నది. 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తుండడంతో జిల్లాలో సేద్యం లాభసాటిగా మారింది. ప్రజలందరూ మూడు పంటలను సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ప్రజలు, అన్నదాతలకు అండగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే నా ఓటు.
-గుర్రం సుధాకర్రెడ్డి, రాందాస్పల్లి( ఆదిబట్ల)
ధరణి రద్దు చేస్తే రైతులకు స్వేచ్ఛ లేకుండా పోయి దళారులు రాజ్యమేలుతారు. కాంగ్రెస్ హయాంలో రైతుల భూములు, రికార్డులకు ఏ మాత్రం భద్రత లేకుండే. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు అధికారుల సాయంతో రిజిస్ర్టేషన్ చేయించుకునేవారు. పేద రైతుల రికార్డుల గురించి పట్టించుకునే ఆస్కారం ఉండేది కాదు. పహణి కావాలన్నా పట్వారీ, వీఆర్వోల చుట్టూ తిరగాల్సి వచ్చేది. లంచం ఇస్తేనే పని అయ్యేది. ధరణితో భూమి రిజిస్ట్రేషన్లు త్వరగా జరిగి వెంటనే పాస్బుక్లు ఇంటికే వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. కాంగ్రెస్ వస్తే రైతులు గోస పడాల్సిందే. కాంగ్రెస్ వద్దు… ధరణి కొనసాగాలి. సీఎం కేసీఆర్ పాలన, ధరణి పోర్టల్తోనే రైతులమంతా క్షేమంగా ఉన్నాం. సీఎం కేసీఆర్కే రైతుల మద్దతు ఉంటుంది.
– యాదగిరి, రైతు, జవహర్నగర్