ఖైరతాబాద్/సిటీ బ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా ఈనెల 7వ తేదీన లోయర్ ట్యాంక్బండ్ సమీపంలోని వెంకట్రామిరెడ్డి ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ సంక్షేమ సమితి గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. గురువారం సారస్వత పరిషత్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమ్మేళనానికి బ్రాహ్మణ సంఘాల నాయకులు, పట్టభద్రులు, అర్చకు లు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలి రానున్నట్లు తెలిపారు. అదేవిధంగా బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ పోస్టర్లను సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీ వీఎస్ఎన్ శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్ నరేందర్ ఆచార్య, రాష్ట్ర బ్రాహ్మణ స్త్రీ శక్తి విభాగం కన్వీనర్ అనురాధతో కలిసి రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జంట నగరాల అధ్యక్షుడు తులసి శ్రీనివాస్ ఆవిష్కరించారు.