హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు బ్రహ్మ కుమారీలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా వారు మంత్రి క్యాంపు కార్యాలయంలో పని చేసే సిబ్బందికి మిఠాయిలు పంచారు.
తమ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న రాజస్థాన్ లోని మౌంట్ అబూలో సెప్టెంబరులో జరిగే అంతర్జాతీయ యోగా సదస్సుకు హాజరు కావాలని వారు మంత్రిని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు వంశీ, మాధవి తదితరులు పాల్గొన్నారు.