చర్లపల్లి, జూలై 11 : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. చర్లపల్లి డివిజన్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, గట్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడు భూపతి బాల్రాజు ఇటీవల మృతి చెందగా.. మంగళవారం ఆయన కుటుంబ సభ్యులకు వా రు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో ని నాయకులు, కార్యకర్తల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తున్నామని, బాల్రాజు కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
అనంతరం కాప్రా డివిజన్కు చెందిన గంగపుత్ర సంఘం నా యకులు వారిని కలిసి సమస్య లు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నా యకులు నాగిళ్ల బాల్రెడ్డి, నారెడ్డి రాజేశ్వర్రెడ్డి, ధనుంజయ్యగౌడ్, శ్రీకాంత్రెడ్డి, భానుచందర్, గణేశ్ముదిరాజ్, గంగపుత్ర సంఘం సభ్యులు రవీందర్, గంగ య్య, మనోహర్రాజు, అంజయ్య, అంజనేయులు, గౌటి అంజనేయులు, జోగుల నర్సింహా, శంకరయ్య, యాదగిరి పాల్గొన్నారు.