పీర్జాదిగూడ,డిసెంబర్ 11: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పర్వతాపూర్ ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులుగుంపులుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని పలువురు వాపోతున్నారు. వీధి కుక్కల దాడిలో చిన్నారులు గాయాల పాలవుతున్నారు. అధికారలు చొరవ తీసుకుని ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.కాలనీలో ఒంటరిగా వెళ్లాలంటే ఏ క్షణంలో కుక్కులు దాడి చేస్తాయోనని జనం జంకుతున్నారు. పలు సందర్భాల్లో కుక్క కాటుకు గురైన చిన్నారులు, వృద్ధులు దవాఖాన పాలవుతున్నారు. రెండు రోజుల క్రితం సాయినగర్కాలనీలో బాలుడిపై కుక్కలు దాడి చేసి తల, కాళ్లపై తీవ్రంగా గాయపరిచాయి. ప్రభుత్వ దవాఖానలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి..
నరగరపాలక పరిధిలోని కాలనీల్లో వీధి కుక్కలు సంచరిస్తూ చిన్నారులపై దాడి చేస్తున్నాయి. కుక్కలు దాడి చేయడం వల్ల చిన్నారులు బయటకు రావాలన్నా భయపడుతున్నారు. పలు చోట్ల చిన్నారులు కుక్క కాటుకు గురై దవాఖాన పాలయ్యా రు. ఇప్పటికైనా కుక్కల బెడదపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
-మహ్మద్ జమీరొద్దీన (గోరీ),మేడిపల్లి
కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం…
నగరపాలక పరిధిలో సంచరిస్తున్న కుక్కలను నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకుంటాం. నగరపాలకలో కుక్కల సంఖ్య పెరుగకుండా వాటికి కుంటుంబనియంత్రణ చికిత్సకు చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహిసుతన్నాం.
-జగన్మోహన్ ( నగరపాలక సంస్థ ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్