సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పంజాగుట్టలోని మెట్రోస్టేషన్లో వినూత్నమైన బుక్ ఫెయిర్ను నిర్వహిస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. లోడ్ ద బాక్స్ ఆఫర్ నేపథ్యంలో నిర్వహిస్తున్న బుక్ ఫెయిర్ ఆగస్టు 15 వరకు ఉంటుందని, అందరికీ ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. బుక్ ఫెయిర్లో విలియం షేక్ స్పియర్, హారీ పోటర్త్అగాథ క్రిస్టీ, రస్కిన్ బాండ్, జెఫ్రీ ఆర్చర్, కెన్ పోలెట్ రచయితల పుస్తకాలను అందుబాటులో ఉన్నాయని తెలిపారు.