ఘట్కేసర్ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ ఘట్ మైసమ్మ జాతర ఆదివారం భక్తి శ్రద్ధ్దలతో జరిగింది. ఈ సందర్భంగా భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల తాకిడి కొనసాగింది. మంత్రి మల్లారెడ్డి,మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్, పోచారం చైర్మన్ కొండల్రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ వెంకట్రెడ్డి తదితర ప్రముఖులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈఓ భాగ్య లక్ష్మి,కమిటీ అధ్యక్షుడు యాదవ్,సభ్యులు,మున్సిపాలిటీ సిబ్బంది ఆలయం వద్ద భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఘట్కేసర్ పోలీసులు వరంగల్ రోడ్డుపై, ఆలయం వద్ద బందోబస్తును నిర్వహించారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ గ్రామ దేవతకు బోనం సమర్పించి, అమ్మవారికి నైవేథ్యాన్ని సమర్పించారు.