చాంద్రాయణగుట్ట, జూలై 11: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పం తో ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహించేందుకు పాతబస్తీ లాల్దర్వాజ ఆ లయ కమిటీ సభ్యు లు ఆదివారం బయలుదేరారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13,14వ తేదీల్లో ఆలయ చైర్మన్ కె.వెంకటేశ్ ఆధ్వర్యంలో దేశరాజధానిలో వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీ బయలుదేరిన వారిలో కమిటీ ఉపాధ్యక్షుడు శీరా రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్, కోశాధికారి అరవింద్ కుమార్గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి చంద్రకుమార్ తదితరులు ఉన్నారు.