కేపీహెచ్బీ కాలనీ, జూలై 9: కూకట్పల్లి పరిసర ప్రాం తాల్లో ఆషాఢ బోనాల వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూసాపేట హెచ్పీ రోడ్డు, కైత్లాపూర్లోని అమ్మవారి ఆలయాల్లో జరిగిన బోనాల వేడుకల్లో ఆదివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్కుమార్ ప్రత్యేక పూజ లు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గామదేవతలకు ఆషాఢమాసంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకోవడం ఆనవాయితీ అని ఈ పండుగను ప్రతియేటా వైభవంగా జరుపుకుని అమ్మవారికి బోనాలతో నైవేద్యాలను సమర్పించడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ కలిసిమెలిసి వేడుకలు జరుపుకోవాలని కోరారు. గ్రామదేవతల అనుగ్రహంతో కూకట్పల్లి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కూకట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనా ల వేడుకలు ఘనంగా జరిగాయి. బాలాజీనగర్ డివిజన్ లో ముళ్లకత్వ చెరువుకట్టపై కొలువుదీరిన కట్టమైసమ్మకు బోనాలతో నైవేద్యం, ఘటాలను సమర్పించి ప్రత్యేక పూజ లు చేశారు. నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనం ఆవరణలో ప్రత్యేక పూజలు చేశారు. న్యాయవాదులు కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్దన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్, హర్షవర్దన్రెడ్డి, గోపాల్రెడ్డి, దావీద్రాజు, రవికాంత్రెడ్డి తదితరులున్నారు.
మూసాపేట చిత్తారమ్మ ఆలయ ప్రాంగణంలోని బీరప్ప ఆలయంలో ఆషాఢం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. మూసాపేట కురుమ సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి బోనాలతో నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మాజీ కార్పొరేటర్ బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎం.ఐలయ్య, కార్యదర్శి కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాలాజీనగర్ డివిజన్ కైత్లాపూర్లో ఆషాఢ బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు బోనాలతో నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్గౌడ్, ఆల య కమిటీ సభ్యులు సంతోష్, యాదయ్య, పిల్లారాజు, వీరేశం, నాగేశ్, ఐలయ్య, అశోక్, కేబుల్ శ్రీను, రమేశ్, కృష్ణ, సుశీల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.