బోడుప్పల్, జూలై12:బోడుప్పల్ నగరపాలక సంస్థ అభివృద్ధికి రూ. 100కోట్ల నిధులు మంజూరు చేయాలని బోడుప్పల్ పాలకవర్గం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను కోరింది.ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సెక్రటేరియేట్లో మంత్రి కేటీఆర్ను కలిసి నిధులు మంజూరు చేయాలని బోడుప్పల్ పాలకవర్గం వినతిపత్రం సమర్పించారు.
మంత్రిని కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ లక్ష్మీరవిగౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.