హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): హౌసింగ్ బోర్డుకు చెంది న ప్లాట్లు, అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల బహిరంగ వేలం ద్వారా రూ.34.27 కోట్ల ఆదాయం సమకూరినట్టు బోర్డు వైస్చైర్మన్ వీపీ గౌతం వెల్లడించారు. మొత్తం 14 ఆస్తులకు బౌరంపేటలోని భూమి, బాచుపల్లిలోని ఓ ఫ్లాట్ మినహా మిగిలిన వాటికి కేపీహెచ్బీ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన వేలంలో 50 మంది బిడ్డర్లు పాల్గొన్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. గచ్చిబౌలిలోని 263 చదరపు గజాల ప్లాట్కు ఈ వేలంలో చదరపు గజం రూ.1.76 లక్షల ధర పలికిందని తెలిపారు. కూకట్పల్లి బాలాజీనగర్లోని 266 చదరపు గజాల ప్లాట్కు రూ.1.64 లక్షలు, చింతల్ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్లకు రూ.74-84 వేల వరకు ధర పలికినట్టు వివరించారు.