హయత్నగర్, ఆగస్టు 13 : పేదల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం సహాయనిధి వరంలాంటిదని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హయత్నగర్కు చెందిన అనంతమ్మ కుటుంబానికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ రూ.60వేలు చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. బాధితురాలు అనంతమ్మ కాన్సర్తో బాధపడుతూ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు నాణ్యమైన ఆధునాతన వైద్య సేవలు పొందేందుకు సీఎం సహయనిధి అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జి.సందీప్ తదితరులు పాల్గొన్నారు.