హైదరాబాద్ : జీడిమెట్ల సుభాష్ నగర్లో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లాస్టిక్ గోడౌన్లో కెమికల్ డబ్బాని కట్ చేస్తుండగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి గోడౌన్ కుప్పకూలిపోయింది. ఇద్దరు క్షతగాత్రులను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు శబ్దం విని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.