హైదరాబాద్ : హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గురువారం సాయంత్రం పేలుడు సంభవించింది. గాంధీ నగర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డ్లో పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి అక్కడే ఉన్న తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న తండ్రీకొడుకులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.