వనస్థలిపురం, ఆగస్టు 17 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టి బొమ్మను టీఆర్ఎస్ యూత్, మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావుపై అనుచిత వ్యాక్యలు చేసినందుకు నిరసనగా కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ జాతీయ రహదారిపై పనామా చౌరస్తా వద్ద దత్తు గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా నాయకుడైన హన్మంతరావుపై అడ్డగోలుగా మాట్లాడడం తగదన్నారు. నిత్యం ప్రజలకోసం తపించే నాయకుడు మైనంపల్లి అన్నారు. బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో కాశీనాథ్, మధురెడ్డి, అనూప్, ఆశీష్, ప్రవీణ్, మహేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.