చంపాపేట, అక్టోబర్ 25 : అభివృద్ధిని చూసి త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించి మరోసారి అసెంబ్లీకి పంపించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఓటర్లను కోరారు. చంపాపేట డివిజన్ పరిధి కర్మన్ఘాట్ అంబేద్కర్ బస్తీలోని బీజేపీ పార్టీకి చెందిన సూల బాబు, పప్పి, జంగయ్య, చందర్, మురళి, సుధాకర్, సురేశ్, నవీన్లతోపాటు అధిక సంఖ్యలో మహిళలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బుధవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పార్టీ కండువాలు మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసే తనను మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని ఓటర్లను కోరుతున్నాను అని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపి కేటాయించిన కోట్లాది నిధులతో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన వివరించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి తనపై నమ్మకంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయ చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్కుమార్రెడ్డి, ఆలయ మాజీ ధర్మకర్త చేగోని మల్లేశ్ గౌడ్, నాయకులు మద్దెల నరేశ్ గౌరిదేవి రాజు, జగదీశ్ గౌడ్, టవర్ శ్రీను, శివగౌడ్, నిఖిల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.