బడంగ్పేట, జూన్ 28 : దళిత బీఆర్ఎస్ నాయకులపై దాడిచేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ బడంగ్పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అన్నారు. బుధవారం బడంగ్పేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడప గడపకూ బీజేపీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ అల్మాస్గూడ 24, 25వ డివిజన్లో పర్యటించారన్నారు.
అనంతరం వైఎస్ఆర్ పార్క్ వద్ద ప్రసంగిస్తున్న సమయంలో మా కాలనీలో సమస్యల ఉన్నప్పుడు మీరు కనపడలేదు అని స్థానిక దళిత వ్యక్తి ముత్యాల నర్సింహ అందెల శ్రీరాములు యాదవ్ను ప్రశ్నించడంతో.. బీజేపీ నాయకులు దాడి చేశారు. సామాన్య దళిత వ్యక్తి ముత్యాల నర్సింహపై దాడి చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడుల ద్వారా అధికారంలోకి వస్తం అని పగటి కలలు కనడం మానుకోవాలన్నారు. బీజేపీ అధిష్టానం వారికి నేర్పిన సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమకు విలువలతో కూడిన రాజకీయం నేర్పించడం జరిగిందన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ నాయకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సంరెడ్డి వెంకట్రెడ్డి, బోయపల్లి శేఖర్రెడ్డి, ముత్యాల కృష్ణ, తుఫాన్రెడ్డి, కర్రె సంజీవ, ముత్యాల దర్శన్, గంట శ్రీను, కందుకూరి శ్రీను, ప్రదీప్, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.