బడంగ్పేట, నవంబర్ 11: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేటకు చెందిన బీజేపీ నాయకులు చక్రవర్తుల జగన్ మోహన్ చార్యులు, పెద్ద బావి భుజంగరెడ్డి, దర్శన్, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్రె కృష్ణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో చేరారు. వారందరికి మంత్రి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్కు చెందిన అనూరాధ ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో మంత్రి సమక్షంలో చేరారు. వారందరిని మంత్రి బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు పెరగడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బేజార్ అవుతున్నాయని ఆమె అన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలో బీజేపీ పార్టీలు ఖాళీ కావడం ఖాయమన్నారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఐదేండ్లలో జరిగిందని, ఇది ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయబోతున్నారన్నారు. బీజేపీ కేంద్రంలో చేస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలకు విసిగి పోయారన్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నదన్నారు. ప్రజలు సంక్షేమం కోసం పనిచేసే వారికి పట్టం కట్టబోతున్నారని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బడంగ్పేట అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, మీర్పేట బీఆర్ఎస్ నాయకులు గౌరీ శంకర్, బండి మీన నగేష్ ఉన్నారు.