జవహర్నగర్, జనవరి 6: సైన్స్తోనే ప్రపంచంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని సీఎస్ఐఆర్, ఎన్ఐఐఎస్టీ త్రివేంద్రం యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.అజయ్ఘోష్ అన్నారు. శుక్రవారం జవహర్నగర్ పరిధిలోని బిట్స్ క్యాంపస్లో నిర్వహించిన ‘నేషనల్ సింపోర్జియమ్ ఆన్ కన్వర్జెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ, మెటీరియల్స్ (సీసీఎం- 2023)పై జాతీయ సదస్సు’ నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ర్టాల విశ్వవిద్యాలయాల నుంచి 150మంది ప్రతినిధులు, 17మంది ప్రొఫెసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అజయ్ఘోష్ మాట్లాడుతూ ఇంధన పరిశోధనలు, ఖనిజాల పునరుత్పత్తి, భౌతిక శాస్త్రం, రసాయశాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.
కరోనా వంటి మహమ్మారిని నివారించాలంటే సైన్స్తోనే సాధ్యమైందని తెలిపారు. పరిశోధన విద్యార్థులు నిత్యం కొత్త ఆవిష్కరణలు సృష్టించాలని పేర్కొన్నారు. భారతదేశం నుండే ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ను పంపగలిగామంటే శాస్త్రవేత్తల కృషి వెలకట్టలేనిదని చెప్పారు. పరిశోధన విద్యార్థులు ఉద్యోగానికే పరిమితం కాకుండా ప్రత్యేకంగా పరిశ్రమలను స్థాపించాలని సూచించారు. మెరుగైన పరిశోధనలు జరిగే దేశంలో నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్ బిట్స్ క్యాంపస్ కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిట్స్ డీన్ అడ్మిన్ నిరంజన్సేన్, కెమిస్ట్రీ హెచ్వోడీ సౌసత్రాయ్, బిట్స్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.