కవాడిగూడ : భోలక్పూర్ డివిజన్ను వ్యాక్సిన్ ఫ్రీ కమ్యూనిటీ గా చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు గురువారం భోలక్పూర్ డివిజన్లోని సిద్దీఖ్నగర్లో అమన్ వేదిక స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ను ఆయన ప్రోగ్రాం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రాజశ్రీ, బైబిల్ హౌజ్ యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శృతి, అమన్ వేదిక డైరెక్టర్ నమ్రతా జైస్వాల్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమన్ వేదిక స్వచ్చంద సంస్థ భోలక్పూర్లోని 9 బస్తీలలో వంద శాతం వ్యాక్సినేషన్ చేయాలని చేస్తున్న ప్రయత్నం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన పురస్కార గ్రహీత పానుగంటి మహేష్ కుమార్, ఎఎన్ఎం సుహాసిని, లక్ష్మీ, ఆశా వర్కర్లు భాగ్యలక్ష్మీ, శ్యాదా, అమన్ వేదిక సభ్యులు ప్రవీణ, నసీర్, సిద్దీఖ్, రమరణి, సంధ్య, అనిత, సుజాత, సుమలత, నగశ్రీ, అంబికా, తదితరులు పాల్గొన్నారు.